NRI: ఉక్రెయిన్‌లో తీవ్రమవుతున్న యుద్ధం.. భారతీయ విద్యార్థుల ముందు 5 ఆప్షన్స్

ABN , First Publish Date - 2022-10-23T19:52:44+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో అక్కడి ఇండియన్ ఎంబసీ తాజాగా మరో కీలక సూచన చేసింది.

NRI: ఉక్రెయిన్‌లో తీవ్రమవుతున్న యుద్ధం.. భారతీయ విద్యార్థుల ముందు 5 ఆప్షన్స్

ఎన్నారై డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో అక్కడి ఇండియన్ ఎంబసీ(Indian Embassy) తాజాగా మరో కీలక సూచన చేసింది. ఉక్రెయిన్‌ సరిహద్దుకు సమీపంలోని ఐదు బార్డర్ క్రాసింగ్స్ ద్వారా దేశాన్ని వీడాలని భారతీయ విద్యార్థులకు సూచించింది. బోర్డర్ చెక్‌పోస్టులకు సంబంధించి ఎంబసీ ఓ సవివరమైన ట్వీట్ చేసింది. ఉక్రెయిన్ వీడాలనుకున్న వారు తమ వద్ద డాక్యుమెంట్లు అన్నీ వెంట తెచ్చుకోవాలని సూచించింది. పాస్‌పోర్టు, ఉక్రెయిన్ రెసిడెంట్ పర్మిట్, స్టూడెంట్ కార్డు, కుదిరితే విమాన సర్ఫిఫికేట్ కూడా వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. ఎంబసీ ప్రకటన ప్రకారం.. ఉక్రెయిన్ నుంచి హంగరీకి వెళ్లాలనుకున్న వారు జాకార్‌పాతియా ప్రాంతంలో సరిహద్దు గుండా దేశాన్ని వీడాలి. స్లోవేకియాకు వెళ్లదలిచిన వారు షెంజెన్ వీసా తెచ్చుకోవాలి. ఉక్రెయిన్ వీడాలని భారతీయులకు ఎంబసీ కార్యాలయం ఇటీవల సూచించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-10-23T19:56:14+05:30 IST