Actors Reunion: బాలీవుడ్‌ నటుడి ఇంట్లో... అలనాటి తారల సందడి!

ABN , First Publish Date - 2022-11-13T17:28:27+05:30 IST

1980ల్లో వెండితెరను ఏలిన దక్షిణాది, ఉత్తరాది నటీనటులు ఒకేచోట కలిశారు. అలనాటి రోజుల్ని, మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటలు ఆడారు... పాటలు పాడారు.. హుషారైన పాటలకు డాన్స్‌లు వేశారు. ఒక్కో ఏడాది ఒక్కో స్టార్‌ ఈ వేడుకలకు ఆతిథ్యం ఇస్తున్నారు.

Actors Reunion: బాలీవుడ్‌ నటుడి ఇంట్లో... అలనాటి తారల సందడి!


1980ల్లో వెండితెరను ఏలిన దక్షిణాది, ఉత్తరాది నటీనటులు ఒకేచోట (80s Actors Reunion)కలిశారు. అలనాటి రోజుల్ని, మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటలు ఆడారు... పాటలు పాడారు.. హుషారైన పాటలకు డాన్స్‌లు వేశారు. ఒక్కో ఏడాది ఒక్కో స్టార్‌ ఈ వేడుకలకు ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ ఏడాది జరిగిన 11వ రీయూనియన్‌ వేడుకకు బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ పూనమ్‌ థిల్లాన్‌ (Jackie Shroff's Home)ఆతిథ్యమిచ్చారు. ముంబైలో జరిగిన ఈ వేడుకల్లో చిరంజీవి(Chiranjeevi), వెంకటేశ్‌ (venkatesh), నదియా(Nadiya), సరిత(Saritha), రమ్యకృష్ణ, విద్యాబాలన్‌, ఖుష్బూ, సుహాసిని, సుమలత, జయప్రద, మధుబాల, అంబిక, లిజీ, రేవతి, రాధ, శోభన, సుమలత, అనుపమ్‌ ఖేర్‌, శరత్‌కుమార్‌, నరేశ్‌, అనిల్‌ కపూర్‌(Anil kapoor), భానుచందర్‌(Bhanu chander), అర్జున్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి ఇలా 30 మంది తారలు ఒకే చోట సందడి చేశారు. హుషారైన పాటలకు స్టెప్పులేశారు. నటి సుమలత  ‘డాన్‌’ చిత్రంలోని ఏ మేరా దిల్‌ ప్యార్‌కా దీవానా’ అంటూ పాట పాడారు. సుహాసిని, లిజీ, అర్జున్‌ ‘నాక్క ముక్క’ పాటకు స్టెప్పులేశారు.  ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కరోనాకు ముందు 2020లో జరిగిన 10వ రీయూనియన్‌ సెలబ్రేషన్స్‌కు మెగాస్టార్‌ చిరంజీవి అతిథ్యం ఇచ్చారు. అంతకుముందు ఊటీ, చెన్నై తదితర ప్రాంతాల్లో ఈ వేడుక జరిగింది. 

2.jpg


Updated Date - 2022-11-13T17:28:28+05:30 IST