Bandi Sanjay: టీఆర్ఎస్‌కు దమ్ముంటే మా సవాల్‌ను స్వీకరించి.. 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

ABN , First Publish Date - 2022-11-06T20:02:25+05:30 IST

మునుగోడు ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఓడిపోతే కుంగిపోము.. గెలిస్తే పొంగిపోమమని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Bandi Sanjay: టీఆర్ఎస్‌కు దమ్ముంటే మా సవాల్‌ను స్వీకరించి.. 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
Bandi Sanjay, bjp mp

హైదరాబాద్: మునుగోడు ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఓడిపోతే కుంగిపోము.. గెలిస్తే పొంగిపోమమని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. కమిట్‌మెంట్‌తో బీజేపీ పనిచేసిందని, టీఆర్ఎస్‌ బెదిరింపులకు తలొగ్గకుండా తమ కార్యకర్తలు పనిచేశారని తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి యుద్ధం చేశారని, టీఆర్ఎస్‌ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను 15 రోజుల్లోగా అమలు చేయాలని సంజయ్‌ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, దమ్ముంటే తమ సవాల్‌ను స్వీకరించి.. ఉపఎన్నికలకు రావాలని సంజయ్‌ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినా స్వల్ప మెజార్టీనే వచ్చిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేసినా 10 వేల మెజార్టీనే వచ్చిందని సంజయ్‌ మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో బీజేపీ లేదన్నారని, మునుగోడు ఫలితం బీజేపీ బలమేంటో చూపించిందని సంజయ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-06T20:06:16+05:30 IST