NHRC: ఐబీఎస్‌లో ర్యాగింగ్‌ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు

ABN , First Publish Date - 2022-11-15T19:49:29+05:30 IST

ఐబీఎస్ (IBS)లో ర్యాగింగ్‌ ఘటనపై ఎన్‌హెచ్ఆర్‌సీ (NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది.

NHRC:  ఐబీఎస్‌లో ర్యాగింగ్‌ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు
Nhrc

హైదరాబాద్‌: ఐబీఎస్ (IBS)లో ర్యాగింగ్‌ ఘటనపై ఎన్‌హెచ్ఆర్‌సీ (NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది. శంకర్‌పల్లిలోని ఐబీఎస్‌లో ర్యాగింగ్‌, దాడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ, యూజీసీకి ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు ఇచ్చింది. ఘటనపై మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించినట్లు ఎన్‌హెచ్ఆర్‌సీ పేర్కొంది. ర్యాగింగ్‌ను అరికట్టేందుకు యూజీసీ నిబంధనలు రూపొందించినా ఏమీ మెరుగుపడలేదంటూ ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసుల్లో పేర్కొంది. ర్యాగింగ్ ఘ‌ట‌న‌పై 6 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది.

Updated Date - 2022-11-15T19:55:00+05:30 IST