Share News

APCC Chief: వైసీపీ మునిగిపోతున్న నావా..

ABN , First Publish Date - 2023-12-12T15:07:08+05:30 IST

Andhrapradesh: వైసీపీ మునిగిపోతున్న నావా అని ప్రజలకు ఇప్పటికే అర్ధమైందని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు చేశారు.

APCC Chief: వైసీపీ మునిగిపోతున్న నావా..

విజయవాడ: వైసీపీ మునిగిపోతున్న నావా అని ప్రజలకు ఇప్పటికే అర్ధమైందని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు (APCC Chief Gidugu Rudraraju) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోని ప్రజలంతా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారన్నారు. నిన్నటి నుంచే వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైందన్నారు. సొంతగూటికి తిరిగి రావాలని చాలా మంది నాయకులు భావిస్తున్నారని తెలిపారు. అనుకోని కారణాల వలన కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ చెంతకు చేరారన్నారు. జగన్ నియంతృత్వ పోకడలతో.. వారు వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోందన్నారు. రేపు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఐసీసీ నేతలతో పాటు ఏపీ సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొంటారన్నారు. రేపటి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

Updated Date - 2023-12-12T15:07:09+05:30 IST