Share News

Balineni: ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది.. ఒంగోలు నుంచే పోటీ చేస్తా

ABN , First Publish Date - 2023-12-09T18:50:49+05:30 IST

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తన కుమారుడు తపన పడ్డాడని, సీఎం జగన్‌కు కాడా తమపై ఉండాలి కదా.. ఉండాలని కోరుకుంటున్నానని బాలినేని వ్యాఖ్యనించారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా..

Balineni: ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది.. ఒంగోలు నుంచే పోటీ చేస్తా

ప్రకాశం: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తన కుమారుడు తపన పడ్డాడని, సీఎం జగన్‌కు కాడా తమపై ఉండాలి కదా.. ఉండాలని కోరుకుంటున్నానని బాలినేని వ్యాఖ్యనించారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా.. ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని రూ. 50 లక్షలు పందెం పెట్టానని చెప్పారు.

"తెలంగాణలో అన్ని జిల్లాలో తిరిగి మా అబ్బాయి బీఆర్ఎస్ వస్తుందని చెప్పాడు. తెలంగాణలో బీఆర్ఎస్ వస్తే ఏపీలో వైసీపీ వస్తుందని మా అబ్బాయి తపన పడ్డాడు. మా అబ్బాయి బాధపడకూడదని పెట్టిన పందెం క్యాన్సిల్ చేశా. జగన్ రావాలని మా అబ్బాయి తపన పడుతున్నాడు. ఆయనకి కూడా ఉండాలి కదా మా మీద...ఉండాలని కోరుకుంటున్నా. పోటీ చేస్తే ఒంగోలు నుండే పోటీ చేస్తా...మరో నియోజకవర్గానికి వెళ్ళను. అందరూ కలిసి పని చేస్తానంటేనే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్ కి చెప్పాను. నేను నీతి మంతుడినని చెప్పడం లేదు. మంత్రిగా ఉన్న సమయంలో బయట ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నాను. వెయ్యి కోట్లు సంపాదించానని ప్రచారం చేస్తున్నారు." అని విమర్శించారు.

Updated Date - 2023-12-09T18:55:46+05:30 IST