Chandrababu news: సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

ABN , First Publish Date - 2023-09-27T16:32:02+05:30 IST

సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదాపడింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి ధర్మాసనం తొలుత విచారణ మొదలుపెట్టింది. అయితే విచారణ నుంచి జస్టిస్ భట్టి తప్పుకున్నారు. దీంతో కేసులు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట మెన్షన్ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.

Chandrababu news: సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదాపడింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి ధర్మాసనం తొలుత విచారణ మొదలుపెట్టింది. అయితే విచారణ నుంచి జస్టిస్ భట్టి తప్పుకున్నారు. దీంతో కేసులు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట మెన్షన్ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట మెన్షన్ చేశారు. మెన్షన్ చేసే సందర్భంలో స్వల్ప వాదనలు జరిగాయి. న్యాయవాది లూథ్రా వాదనలను ప్రభుత్వ లాయర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదిలావుండగా తగిన బెంచ్ ఎదుట కేసును బదిలీ చేసి అక్టోబర్ 3న తదుపరి విచారణ చేపట్టనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వెల్లడించారు.

Updated Date - 2023-09-27T16:34:04+05:30 IST