Chandrababu: 2022 మొత్తం విధ్వంసాలు, విద్వేషాలతో గడిచింది

ABN , First Publish Date - 2023-01-01T18:56:56+05:30 IST

వికాస్నగర్లో టీడీపీ (TDP) నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) పాల్గొన్నారు.

Chandrababu: 2022 మొత్తం విధ్వంసాలు, విద్వేషాలతో గడిచింది

గుంటూరు: వికాస్నగర్లో టీడీపీ (TDP) నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) పాల్గొన్నారు. పేదలకు చంద్రన్న కానుకలను చంద్రబాబు అందించారు. ఉయ్యూరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 2022 మొత్తం విధ్వంసాలు, విద్వేషాలతో గడిచిందని, పేదలకు న్యాయం చేయాలని మొదట అనుకున్నది ఎన్టీఆర్ అని చంద్రబాబు తెలిపారు. 1983లో కిలో బియ్యం రూ.2కే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దే అని చంద్రబాబు చెప్పారు. ఇవాళ్టి ఆహార భద్రత పథకానికి స్ఫూర్తి .. ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. పేదవాళ్లకు పక్కా ఇళ్లు ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారని, టీడీపీ హయాంలో సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చామని, ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ పాలనలో ఐటీకి ప్రాధాన్యం ఇచ్చామని, పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ టీడీపీ అని, మేం 54 లక్షల మందికి రూ.2 వేలు పెన్షన్ అందించామని చంద్రబాబు వెల్లడించారు.

Updated Date - 2023-01-01T18:57:59+05:30 IST