Chittoor Dist.: వైవీ సుబ్బారెడ్డి కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2023-04-28T13:36:07+05:30 IST

చిత్తూరు జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి (AP Deputy CM Narayana Swamy) ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ అర్థకాదు.

Chittoor Dist.: వైవీ సుబ్బారెడ్డి కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం

చిత్తూరు జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి (AP Deputy CM Narayana Swamy) ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ అర్థకాదు. అలాంటి ఆయన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) కాళ్లకు నమస్కారం చేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఏ కార్యక్రమంలో నారాయణ స్వామి పాల్గొన్నా.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పేరు ఎత్తకుండా ఉండలేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కాళ్లకు తన చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టిస్తానని చెప్పకపోతే పొద్దుపోదు.

నారాయణ స్వామి తన సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరు పరిధిలోని పెనుమూరు మండలంలో నిర్మించుకున్న టీటీడీ కళ్యాణమండపం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామితో పాటు వైవీ సుబ్బారెడ్డి, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి ఏవేవో మాట్లాడడంతోపాటు వైవీ సుబ్బారెడ్డి కాళ్లకు నమస్కారం చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

Updated Date - 2023-04-28T13:36:07+05:30 IST