Share News

CM JAGAN: తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం

ABN , First Publish Date - 2023-12-02T19:37:09+05:30 IST

తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. తుపాన్ పరిస్థితులపై అధికారులను సీఎం అడిగి వివరాలు తెలుసుకున్నారు.

CM JAGAN: తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం

అమరావతి: తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. తుపాన్ పరిస్థితులపై అధికారులను సీఎం అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఈనెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. సీఎం ఆదేశాల మేరకు 8 జిల్లాలకు ముందస్తుగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తిరుపతి జిల్లాకు రూ.2 కోట్లు, SPSR నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ప.గో, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ.1 కోటి చొప్పున నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

"బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుపాన్‌గా మారుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశం. కరెంట్, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించాలని ఆదేశం. తుపాన్ ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట సహాయశిబిరాలు ఏర్పాటు చేయాలి." అని సీఎం జగన్ అన్నారు.

Updated Date - 2023-12-02T19:38:20+05:30 IST