Home » Rains
రాష్ట్రంలో గాలి, వడగాళ్ల వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ ఉండి, సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భీకరమైన గాలులకు తోడు వర్షం, వడగళ్లు కురుస్తుండడంతో తీవ్రమైన పంట నష్టం జరుగుతోంది.
తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా అరటి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే.. తిరుప్పూరులో కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
ఈనెల 12వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 12 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించింది.
రాష్ట్రంలో గురువారం కురిసిన అకాల వర్షానికి పలు జిల్లాల్లో వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో కోతకు వచ్చిన సుమారు 400 ఎకరాల వరి పంట నేలవాలింది.
గత కొద్దిరోజులుగా ఎండవేడిమితో అల్లాడిపోయిన నగర ప్రజలకు అకాల వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం భారీగానే కురిసింది. అయితే.. ఈ వర్షం వేసవి తాపాన్ని కొంత తగ్గించిందని చెప్పవచ్చు.
కూల్.. కూల్.. వాతావరణం చల్లబడింది. గతకొద్దిరోజులుగా ఎండవేడితో అల్లాడిపోయిన ప్రజలకు గురువారం సాయంత్రం నుంచి వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజలకు కొంత ఉపశమనం దొరికినట్లు అయింది.
సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, హైదరాబాద్లో ఒకటి నుంచి రెండు గంటలపాటు నాన్స్టాప్గా జల్లులు కొనసాగుతాయని వెల్లడించారు. తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
గత రెండు, మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా, భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
అకాల వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.