Former Minister: ఏపీకి ఈ రోజు చీకటి రోజ, సైకో జగన్కు పిచ్చి ముదిరింది: మాజీమంత్రి
ABN , First Publish Date - 2023-09-09T09:06:42+05:30 IST
ఏపీకి ఈ రోజు చీకటి రోజు అని మాజీమంత్రి నక్కా ఆనందబాబు(Former Minister Nakka Ananda Babu) పేర్కొన్నారు. టీడీపీ
గుంటూరు: ఏపీకి ఈ రోజు చీకటి రోజు అని మాజీమంత్రి నక్కా ఆనందబాబు(Former Minister Nakka Ananda Babu) పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసుల తీరు సిగ్గు చేటన్నారు. జగన్ మోచేతి నీళ్లు తాగుతున్న అధికారులు ఈ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ స్థాయిలో మచ్చలేని నేత చంద్రబాబు అన్నారు. తాను జైలుకు వెళ్లి వచ్చాడు కాబట్టి అందరు జైలుకు వెళ్లాలని జగన్ కుట్ర అని ఆయన అన్నారు. అమరావతి పై ఎన్నో కేసులు పెట్టారు. ఇప్పడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొండను తవ్వి ఎలుక తోక కూడా పీకలేరని, టిడిపి కు వస్తున్న ప్రజాదరణ చూసి జగన్ కు వణుకు పుడుతుందని ఆయన అన్నారు. సైకో జగన్కు పిచ్చి ముదిరిందని, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా బాబు వెంట్రుక కూడా పీకలేరని ఆయన అన్నారు.