Independence Day: ఏపీ బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2023-08-15T10:38:48+05:30 IST

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Independence Day: ఏపీ బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence day Celebrations) ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి (AP BJP Chief Daggubati Purandeshwari) జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ... స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన వారికి నివాళులు అర్పించారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం అని అన్నారు. అన్ని వర్గాల వారికి పెద్ద పీట వేస్తూ సంక్షేమం అభివృద్ధి చేసింది కేంద్రం అని చెప్పుకొచ్చారు. సౌభ్రాతృత్వ భావనతో మనందరం ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో భారతదేశంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-08-15T10:38:48+05:30 IST