Home » Purandeswari
కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) స్పష్టం చేశారు. బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో భాగంగా ఈ మేరకు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారిత పార్టీ అని పురంధేశ్వరి ఈ సందర్భంగా అన్నారు.
ఏపీలో ఉన్న పరిశ్రమలను ఐదేళ్లలో వైసీపీ (YSRCP) ప్రభుత్వం దెబ్బతీసిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandeswari) అన్నారు. రాష్ట్రంలో కోళ్ల పెంపకం పెద్ద సంఖ్యలో జరుగుతుందని చెప్పారు. 2019కి ముందు కోళ్ల పెంపకానికి సంబంధించి రైతులకు ఇంట్రెస్ట్ సబ్సిడీ సౌకర్యం ఇచ్చేవారని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వారికి ఇచ్చే సబ్సిడీ పూర్తిగా ఎత్తేశారని మండిపడ్డారు.
మంత్రి బొత్స సత్యనారాయణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని అన్నారు. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని పురందేశ్వరి ఫైర్ అయ్యారు. బొత్స చేసిన వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
Andhrapradesh: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలో రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, గోపాలపురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. పంచాయతీ నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు. ఈ వర్గానికి సంపూర్ణ న్యాయం చేయని పరిపాలన సాగించారన్నారు.
ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో సభలో మోదీ ప్రసంగించనున్నారు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మేనిఫెస్టోను (NDA Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోపై చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మేనిఫెస్టోలో బీజేపీ పాత్ర ఎందుకు లేదు..? ఫోటోలు ఎందుకు లేవు..? అనే విషయాలపై క్లియర్ కట్గా చంద్రబాబే చెప్పినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొందరు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన పరిస్థితి...
Andhrapradesh: అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. బుధవారం గోపాలపురం మండలం లో విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్న బీజేపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థి పూరందేశ్వరికి తెలుగు మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు నియోజవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.
ఏపీలో ట్రిబుల్ ఇంజన్ పాలన అవసరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. ఎన్నికల్లో ప్రచారం, కూటమితో కలిసి జనంలోకి వెళ్లే అంశాలపై నేతలకు అగ్ర నాయకత్వం నిర్దేశించింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ఎన్నికల మేనెజ్ మెంట్ కమిటీతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులను అప్పగించ వద్దంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. ఈ మేరకు శనివారం నాడు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల (Election Commission) కు ఆమె లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు కలిసి సీఈఓ ముకేష్ కుమార్ మీనాకు సూచించినట్లు తెలిసిందని చెప్పారు.