Share News

AP News: ఏపీ సీఎస్‌కు రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2023-10-22T09:55:27+05:30 IST

విజయవాడ: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆ లేఖలో కోరారు.

AP News: ఏపీ సీఎస్‌కు రామకృష్ణ లేఖ

విజయవాడ: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆ లేఖలో కోరారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది ఉపాధ్యాయులకు దాదాపు రూ. 800 కోట్లు జగన్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, ఉద్యోగులకు 2022 జూలై నుండి ఇవ్వాల్సిన డిఎను 2024లో మూడు విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పటం దుర్మార్గమన్నారు. తమ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారన్నారు. సిపిఎస్ రద్దు విషయంలో కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-22T09:55:27+05:30 IST