AP News: గ్రీన్‌కో ప్రాజెక్ట్‌ పనుల్లో ప్రమాదం.. నలుగురు మృతి

ABN , First Publish Date - 2023-07-21T14:19:04+05:30 IST

జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం వద్ద గ్రీన్ కో ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది.

AP News: గ్రీన్‌కో ప్రాజెక్ట్‌ పనుల్లో ప్రమాదం.. నలుగురు మృతి

నంద్యాల: జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం వద్ద గ్రీన్ కో ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్‌లో పనిచేస్తుండగా మట్టి పెళ్లలు మీద పడి నలుగురు కార్మికులు మృతి చెందారు. టెన్నెల్‌లో జరిగిన ఘటనా స్థలంలో మరో పది మంది చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కార్మికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమలోని వాహనాలను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. పరిశ్రమలో సరైన సేఫ్టీ ప్రమాణాలు పాటించ లేదని కార్మికులు ఆగ్రహం చేస్తున్నారు. అందుకే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు పరిశ్రమ వద్దకు భారీగా మోహరించారు. మృతులు జార్ఖండ్ వాసులుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-07-21T14:19:04+05:30 IST