Share News

Nara Bhuvaneswari: నా భర్త చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్లా.. దేవుడి దయతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నా

ABN , First Publish Date - 2023-10-24T22:16:13+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనతో లేకుండా తొలిసారి తిరుమల వెళ్లానని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు.

Nara Bhuvaneswari: నా భర్త చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్లా.. దేవుడి దయతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నా

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనతో లేకుండా తొలిసారి తిరుమల వెళ్లానని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు.

"నా భర్త చంద్రబాబునాయుడు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను... ఈ ప్రయాణం భారంగా ఉంది. దేవుడి దయతో నిజం గెలుస్తుంది అని నమ్ముతున్నా. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను.. ఆయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు తొలి అడుగు వేస్తున్నాను." అని నారా భువనేశ్వరి అన్నారు.

nb.jpg

Updated Date - 2023-10-24T22:30:49+05:30 IST