Bhuvaneshwari: రాజధానిపై నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-10-03T15:40:24+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bhuvaneshwari: రాజధానిపై నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తనను పరామర్శించేందుకు వచ్చిన అమరావతి రైతులతో నారా భువనేశ్వరి ముచ్చటించారు. అమరావతి రాజధాని నిర్మాణం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. రైతుల త్యాగాలు వృధా కావన్నారు. ప్రభుత్వం అడ్డదారిలో వస్తోందని.. మనం ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కోవాలని సూచించారు. క్లిష్ట సమయంలో ప్రజల మద్దతు తమకు కొండంత ధైర్యాన్ని ఇస్తోందన్నారు. ఓట్ల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని... అదే మన ఆయుధమని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-03T15:40:24+05:30 IST