Share News

Crime News.. నెల్లూరు జిల్లా: కావలిలో దారుణం

ABN , First Publish Date - 2023-10-28T07:57:15+05:30 IST

నెల్లూరు జిల్లా: కావలిలో దారుణం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. రౌడీమూఖలు పెట్రేగిపోతున్నాయి. బైకు అడ్డంగా ఉండగా హారన్ మోగించారని ఆర్టీసీ డ్రైవర్లపై మూకుమ్మడిగా దాడి చేసి, హత్యాయత్నం చేశారు.

Crime News.. నెల్లూరు జిల్లా: కావలిలో దారుణం

నెల్లూరు జిల్లా: కావలిలో దారుణం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. రౌడీమూఖలు పెట్రేగిపోతున్నాయి. బైకు అడ్డంగా ఉండగా హారన్ మోగించారని ఆర్టీసీ డ్రైవర్లపై మూకుమ్మడిగా దాడి చేసి, హత్యాయత్నం చేశారు. జాతీయ రహాదారి నడిరోడ్డులో బస్సును కారుతో అడ్డగించి దాష్టీకం ప్రదర్శించారు. ఆర్డీసీ డ్రైవర్ బీఆర్ సింగ్‌ని రోడ్డుపై పడేసి కాళ్లతో తన్నతూ రౌడీలు రెచ్చిపోయారు. అడ్డొచ్చిన వారిని, వీడియోలు తీయబోయిన వారిపైనా దాడి చేసి.. చంపి పాతిపెడతామంటూ హెచ్చరించారు. ఎవరొస్తారంటూ తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఈ ఘటనలో దేవరకొండ సుధీర్‌తో పాటు పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల అరెస్టులో జాప్యం జరిగింది. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated Date - 2023-10-28T07:57:15+05:30 IST