Balineni Srinivas: ఎట్టకేలకు ఒంగోలుకు బాలినేని.. నేతల ఘన స్వాగతం

ABN , First Publish Date - 2023-05-05T13:31:34+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ హైదరాబాద్‌ నుంచి ఒంగోలుకు చేరుకున్నారు.

Balineni Srinivas: ఎట్టకేలకు ఒంగోలుకు బాలినేని.. నేతల ఘన స్వాగతం

ఒంగోలు: వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి (YCP MLA Balineni Srinivasreddy) హైదరాబాద్‌ నుంచి ఒంగోలుకు చేరుకున్నారు. గతనెల 29న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. అప్పటి నుంచి బాలినేని హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. మూడు రోజుల క్రితం బాలినేని శ్రీనివాస్‌ రెడ్డిని బుజ్జగించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ప్రయత్నించారు. కానీ బాలినేని మాత్రం తన అలక వీడలేదు. వైసీపీ రిజనల్ కోఆర్డినేటర్ పదవి తిరిగి చేపట్టేది లేదని బాలినేని తెగేసి చెప్పారు. సొంత జిల్లా ప్రకాశంలో బాలినేనికి ప్రాధాన్యత లేకపోవడంపై కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఆయన వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత మొదటి సారి ఒంగోలు వచ్చిన బాలినేనికి వైసీసీ శ్రేణులు ఒంగోలు రైల్వేస్టేషన్ వద్ద ఘన స్వాగతం పలికారు.

balineni-srinivasreddy1.jpg

Updated Date - 2023-05-05T13:31:34+05:30 IST