Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. అంతలోనే..

ABN , First Publish Date - 2023-07-22T18:23:07+05:30 IST

పుల్లంపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటు చేసుకుంది.

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. అంతలోనే..
ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్న దృశ్యాలు

పుల్లంపేట, అన్నమయ్య జిల్లా: పుల్లంపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని (lorry) ఆర్టీసి బస్సు (RTC bus) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 5గురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ఆర్టీసి బస్సు తిరుపతి నుంచి కడపకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు, స్థానికులు చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు సమాచారాన్ని అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి కడపకు వస్తుండగా ఘటన జరిగింది.

Updated Date - 2023-07-22T20:10:12+05:30 IST