AP News: తిరుమల ఘాట్‌లో సుమో బోల్తా

ABN , First Publish Date - 2023-06-21T21:25:47+05:30 IST

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో బుధవారం ఓ సుమో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు గాయపడ్డారు. తిరుమలలో విధులు నిర్వహించే..

AP News: తిరుమల ఘాట్‌లో సుమో బోల్తా

తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో బుధవారం ఓ సుమో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు గాయపడ్డారు. తిరుమలలో విధులు నిర్వహించే నలుగురు కానిస్టేబుళ్లు ప్రొవిజన్స్‌ కొనుగోలు కోసం డిపార్ట్‌మెంట్‌ సుమోలో బుధవారం మధ్యాహ్నం తిరుపతికి ప్రయాణమయ్యారు.మొదటిమలుపు వద్ద సుమో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న అడవిలోకి దూసుకెళ్లి బోల్తాపడింది.వాహనంలోని దుర్గా వరప్రసాదరావు, బాషా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వర్షం పడుతుండడంతోనే ప్రమాదం జరిగిందని కానిస్టేబుళ్లు తెలిపారు. అలాగే సాయంత్రం 4 గంటలకు మొదటిఘాట్‌రోడ్డులోని 45వ మలుపు వద్ద మరో కారు అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న నీటితొట్టెను ఢీకొంది. ఈ ప్రమాదంలో బెంగుళూరుకు చెందిన ముగ్గురు భక్తులకు స్వల్పగాయాలయ్యాయి.

Updated Date - 2023-06-21T21:25:47+05:30 IST