Share News

ACB Court: చంద్రబాబు ములాఖత్‌ల విషయంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే..

ABN , First Publish Date - 2023-10-20T11:32:37+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్ పెంపు పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున రోజుకు మూడు సార్లు ములాఖత్ పెంచాలని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున లాయర్లు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈరోజు (శుక్రవారం) ఏసీబీ కోర్టులో విచారణకు రాగా.. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు.

ACB Court: చంద్రబాబు ములాఖత్‌ల విషయంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే..

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) లీగల్ ములాఖత్ పెంపు పిటిషన్‌ను ఏసీబీ కోర్టు (ACB Court) తిరస్కరించింది. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున రోజుకు మూడు సార్లు ములాఖత్ పెంచాలని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున లాయర్లు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (శుక్రవారం) ఏసీబీ కోర్టులో విచారణకు రాగా.. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు. ప్రతివాదులను చేర్చాలని న్యాయమూర్తి సూచించగా.. ప్రతివాదుల పేర్లు చేరుస్తామని కోర్టుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు తెలిపారు. ప్రస్తుతం ప్రతీ రోజు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో న్యాయవాదులు ములాఖత్ జరుగుతోంది.


ఇంతకుముందు ఇలా...

కాగా.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించిన విషయం తెలిసిందే. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ అధికారులు వింత సాకులు చెపుతున్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు. ఖైదీల రాకపోకలకు చంద్రబాబు ములాఖత్ వల్ల ఇబ్బంది అంటూ చెప్పడంపై టీడీపీ మండిపడుతోంది. రాజమండ్రి జైల్లో ఐదు వారాలుగా లేని భద్రతా ఇబ్బంది.. ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటూ ప్రభుత్వం చెపుతున్న కారణాలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతూ లీగల్ ములాఖత్‌‌లను కూడా కుదించడం కుట్రే అంటని టీడీపీ వ్యాఖ్యానించింది.

Updated Date - 2023-10-20T12:13:19+05:30 IST