Share News

AP HighCourt: స్కిల్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన లోకేష్ సన్నిహితుడు

ABN , First Publish Date - 2023-11-10T12:30:40+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు.

AP HighCourt: స్కిల్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన లోకేష్ సన్నిహితుడు

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ (Kilaru Rajesh) హైకోర్టును (AP Highcourt) ఆశ్రయించారు. స్కిల్ కేసులో తనకు సీఆర్పీసీలోని సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి విచారణలో బెదిరించిన వైనాన్ని పిటీషన్‌లో రాజేష్ వివరించారు. రాజేష్ తరపున హైకోర్ట్‌లో సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగనుంది.


మరోవైపు రాజేష్‌ను రెండు రోజులు క్రితం హైదరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు వెంటాడినట్టు కేసు నమోదు అయ్యింది. తనను వెంటాడిన వారి ఫోటోలు, వాహనం నంబర్‌తో సహా పోలీసులకు రాజేష్ ఇచ్చారు. ఈ కేసుపై హైదరాబాద్ పోలీసు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-11-10T12:40:38+05:30 IST