Merugu Nagarjuna: అందుకే వారిని పార్టీ నుంచి బహిష్కరించాం..

ABN , First Publish Date - 2023-03-31T11:39:39+05:30 IST

విశాఖ: ఏపీ (AP)లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారో తమకు తెలుసునని మంత్రి మెరుగు నాగార్జున కామెంట్స్ చేశారు.

Merugu Nagarjuna: అందుకే వారిని పార్టీ నుంచి బహిష్కరించాం..

విశాఖ: ఏపీ (AP)లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) ఎవరు క్రాస్ ఓటింగ్‌ (Cross Voting)కు పాల్పడ్డారో తమకు తెలుసునని మంత్రి మెరుగు నాగార్జున (Minister Merugu Nagarjuna) కామెంట్స్ (Comments) చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అందుకే వారిని పార్టీ నుంచి బహిష్కరించామన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి (MLA Sridevi)కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమెనే చెప్పాలన్నారు. సీఎం జగన్ (CM Jagan) దయవల్లే శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారని.. ఆమెకు వైసీపీ (YCP) సానుభూతి పారులు వెహికల్ కూడా ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే పార్టీ లైన్ దాటడంతో వెహికల్ తీసుకున్నారని.. ఇందులో దౌర్జన్యం ఏమీ లేదన్నారు.

ఈనాడు పేపర్ అధినేతకు ఇప్పుడు దళితులపై విపరీతమైన ప్రేమ పుట్టుకువస్తోందని మంత్రి మెరుగు నాగార్జున విమర్శించారు. గతంలో దళితులపై దాడులు, వెలివేతలు జరిగితే పేపర్‌లో వార్తలు రాసిన దాఖలాలు లేవన్నారు. సీపీఐ నేత నారాయణ (CPI Leader Narayana) వ్యాఖ్యలు చూస్తుంటే విడ్డురంగా ఉందని మెరుగు నాగార్జున అన్నారు.

Updated Date - 2023-03-31T11:39:39+05:30 IST