Visakha నగరం నడిబోడ్డున దారుణం..

ABN , First Publish Date - 2023-02-17T11:12:19+05:30 IST

విశాఖ నగర నడిబొడ్డులో దారుణం చోటు చేసుకుంది. గంజాయికి విశాఖ అడ్డాగా మారుతోంది. మద్యం, గంజాయి సేవించి కొందరు యువకులు దారుణాలకు పాల్పడుతున్నారు.

Visakha నగరం నడిబోడ్డున దారుణం..

విశాఖ: విశాఖ నగర నడిబొడ్డులో దారుణం చోటు చేసుకుంది. గంజాయికి విశాఖ అడ్డాగా మారుతోంది. మద్యం, గంజాయి సేవించి కొందరు యువకులు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా వన్ టౌన్ ప్రాంతంలో ఓ మహిళపై ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. యువకుడిని ప్రశ్నించిన బంధువులపై సైతం భౌతిక దాడులకు పాల్పడ్డారు. వివాహ కార్యక్రమానికి కుటుంబంతో సహా వెళ్లి వస్తుండగా గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం, గంజాయి సేవించి మత్తులో దారుణాలకి ఆకతాయిలు పాల్పడుతున్నారు. వన్ టౌన్ ప్రాంతం రంగిరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కౌన్సిలింగ్‌లకు పరిమిత కాకుండా.. కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-17T11:12:41+05:30 IST