Share News

Michoung Effect: పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతకు అపారనష్టం

ABN , First Publish Date - 2023-12-07T07:40:12+05:30 IST

ప.గో. జిల్లా: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతకు అపారనష్టం సంభవించింది. ఏలూరు జిల్లాలో 68 వేల 55 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది.

Michoung Effect: పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతకు అపారనష్టం

ప.గో. జిల్లా: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతకు అపారనష్టం సంభవించింది. ఏలూరు జిల్లాలో 68 వేల 55 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. విద్యుత్ శాఖకు 2.46 కోట్ల నష్టం రాగా.. తుపాను వలన ఐదుగురు మృతి చెందగా.. వాగులో కొట్టుకుపోయి ఒకరు గల్లంతయ్యారు.

తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 11.8 సె.మీ. సరాసరి వర్షపాతం నమోదు కాగా.. జంగారెడ్డిగూడెంలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 30 సె.మీ. వర్షపాతం నమోదైంది. పెదపాడులో అతి తక్కువ వర్షపాతం 10 సె.మీ. నమోదు కాగా.. భారీ వర్షాలతో జలాశయాల్లోకి వరద నీరు చేరింది. ఎర్రకాల్వ రిజర్వాయర్, తమ్మిలేరు, జల్లేరు రిజర్వాయర్లలలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. దీంతో అధికారులు ఎర్రకాల్వ రిజర్వాయర్ నుంచి 11వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

Updated Date - 2023-12-07T07:40:14+05:30 IST