Lokesh: లోకేష్ అరెస్టుకు రంగం సిద్ధం..? బరిలోకి బ్రాహ్మణి?..

ABN , First Publish Date - 2023-09-28T12:55:29+05:30 IST

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి నుంచి తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ లోపే లోకేష్ రాజమండ్రి రావాలని పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ) సూచించినట్లు సమాచారం. ఒకవేళ లోకేష్‌ను అరెస్టు చేస్తే..

Lokesh: లోకేష్ అరెస్టుకు రంగం సిద్ధం..? బరిలోకి బ్రాహ్మణి?..

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి (TDP National General Secretary) నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) శుక్రవారం రాత్రి నుంచి తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ లోపే లోకేష్ రాజమండ్రి రావాలని పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ (PAC) సూచించినట్లు సమాచారం. ఒకవేళ లోకేష్‌ను అరెస్టు (Arrest) చేస్తే.. అదే ముహూర్తానికి పాదయాత్ర మొదలుపెట్టేందుకు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి (Nara Brahmini) సిద్ధమయ్యారు. ఆమెకు ఇప్పటికే అన్ని విషయాలను కుటుంబసభ్యులు వివరించినట్లు తెలుస్తోంది. నారా, నందమూరి కుటుంబాలకు చెందిన బ్రాహ్మణి పాదయాత్ర చేస్తే ప్రజల్లో సానుభూతి ఎక్కువగా వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో లోకేష్ పాదయాత్రను మరో వారం రోజులపాటు వాయిదా వేయాలని కూడా పార్టీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీ వరకు ఎదురు చూడాలనేది నేతల మాట. ఇక బ్రాహ్మణి పాదయాత్ర అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అధికారపార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి వస్తుందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊహించినదానికంటే ఎక్కువగా నిరసనలు, సానుభూతి ఉందనేది అధికారపార్టీ ఎమ్మెల్యేల మాట. మహిళలు, యువతలో వస్తున్న సానుభూతి ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2023-09-28T12:55:29+05:30 IST