Big Relief For Consumers: కేంద్రం ఆదేశంతో తగ్గనున్న వంటనూనెల ధరలు

ABN , First Publish Date - 2023-05-05T09:48:33+05:30 IST

కేంద్రప్రభుత్వ ఆదేశంతో దేశంలో శుక్రవారం నుంచి వంటనూనెల ధరలు తగ్గనున్నాయి...

Big Relief For Consumers: కేంద్రం ఆదేశంతో తగ్గనున్న వంటనూనెల ధరలు
Big Relief For Consumers

న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వ ఆదేశంతో దేశంలో శుక్రవారం నుంచి వంటనూనెల ధరలు తగ్గనున్నాయి.వంట నూనెల వినియోగదారులకు కేంద్రం పెద్ద ఊరట కల్పించింది.(Big Relief For Consumers) అంతర్జాతీయంగా ఆహార నూనెల ధరల తగ్గుదలకు అనుగుణంగా భారతదేశంలోని ఎడిబుల్ ఆయిల్ ధరలను తక్షణం తగ్గించాలని(Cut Edible Oil Price) కేంద్రప్రభుత్వం ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. అంతర్జాతీయ ఆహార నూనెల ధరల తగ్గుదలకు అనుగుణంగా వంట నూనెల ధరల ఎంఆర్‌పీ చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.దీంతో మదర్ డెయిరీ సంస్థ వంటనూనెల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి : Karnataka Assembly Election: ముగియనున్న ప్రచారపర్వం...పెరిగిన డబ్బు, మద్యం ప్రవాహం

కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEAI),ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) సభ్యులు పాల్గొన్నారు. గత రెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ వంట నూనెల ధరలు టన్నుకు 200-250 డాలర్లు తగ్గాయని, అయితే రిటైల్ మార్కెట్లలో ప్రతిబింబించేందుకు సమయం పడుతుందని అంటున్నారు. తాజాగా కేంద్ర కార్యదర్శి ఆదేశంతో దేశంలో వంట నూనెల రిటైల్ ధరలు త్వరలో తగ్గుతాయని ఆయిల్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-05-05T09:54:08+05:30 IST