Viral: సాయంత్రం నుంచి కనిపించని కొడుకు.. అనుమానంతో బెడ్ కింద చూసిన తల్లికి గుండె ఆగడం ఒకటే మిగిలింది.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-08-12T17:39:42+05:30 IST

ఢిల్లీలోని ఇందర్‌పురి ప్రాంతంలో దారుణం జరిగింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి బాలుడి కోసం ఎంత వెతికినా అచూకీ లభించలేదు. చివరకు బెడ్ కింద కొడుకు అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి తల్లడిల్లిపోయింది.

Viral: సాయంత్రం నుంచి కనిపించని కొడుకు.. అనుమానంతో బెడ్ కింద చూసిన తల్లికి గుండె ఆగడం ఒకటే మిగిలింది.. అసలు ఏం జరిగిందంటే..?

ఢిల్లీలోని ఇందర్‌పురి ప్రాంతంలో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలుడిని చంపేసి వారింట్లోనే పడుకునే బెడ్ కింద(బెడ్ బాక్స్)లో శవాన్ని దాచారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి బాలుడి కోసం ఎంత వెతికినా అచూకీ లభించలేదు. చివరకు బెడ్ కింద కొడుకు అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి తల్లడిల్లిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించింది. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు. బాలుడి మెడపై గొంతు నులిమి చంపిన గుర్తులున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నీలు పాల్(32),(Neelu Pal) జితేందర్ సింగ్(33)(Jitender Singh) భార్యభర్తలు. భార్యభర్తలిద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ కొంతకాలం క్రితం వారిద్దరు చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు. దీంతో అప్పటి నుంచి వారి 11 ఏళ్ల కొడుకు తల్లితోనే ఉంటున్నాడు. అయితే ఈ విడాకులకు పూజ(24)(Pooja) అనే మహిళ కారణమనే ఆరోపణలున్నాయి. జితేందర్ సింగ్ తన కుటుంబాన్ని వదిలి తనను వివాహం చేసుకునేలా పూజ ఒప్పించిందని అంటున్నారు.


గురువారం సాయంత్రం బాలుడి తల్లి నీలు తన విధులను ముగించుకుని ఇంటికి వచ్చింది. కానీ బాలుడు ఇంట్లో కనిపించలేదు. పైగా ఇల్లు తాళం వేసి ఉంది. అయితే తన కొడుకు సాయంత్రం వాకింగ్‌కు బయటికి వెళ్లి ఉంటాడని నీలు మొదట భావించింది. కానీ ఇంతలోనే ఆమెకు బాలుడు డ్యాన్స్ క్లాస్‌కు రాలేదని టీచర్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆమె కొడుకు కోసం ఇంటా, బయట అంతా వెతికింది. కానీ బాలుడు ఎక్కడా కనిపించలేదు. బహుషా తండ్రి దగ్గరికి ఏమైనా వెళ్లాడేమో అనే ఉద్దేశ్యంతో జితేందర్‌కు ఫోన్ చేసింది. కానీ ఆ కాల్‌ను ఒక మహిళ లిఫ్ట్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసి ‘‘ఒకరికి అత్యంత ఇష్టమైన ఆస్తిని తీసివేస్తే ఎలా అనిపిస్తుంది’’ అని నీలును అడిగింది. దీంతో నీలు ఒకసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉండడాన్ని నీలు గమనించింది. మరో సారి బెడ్ రూంలో క్షుణ్ణంగా వెతికింది. అయితే బెడ్ బాక్స్ కాస్త తెరిచి ఉండడాన్ని గమనించింది. దీంతో బెడ్ బాక్స్ తెరిచి చూసి అవాక్కైంది. బెడ్ బాక్స్‌లో ఆమె 11 ఏళ్ల కొడుకు అపస్మారక స్థిలో పడి ఉన్నాడు. దీంతో నీలు షాక్‌కు గురైంది. కొడుకును ఆ స్థితిలో చూసి ఆమెకు కాలు చేతులు ఆడలేదు. ఒకరంగా చెప్పాలంటే ఆమెకు గుండె ఆగిపోవడం ఒకటే మిగిలి ఉంది. తల్లడిల్లిన నీలు చుట్టుపక్కల వారి సాయంతో బాబును సమీపంలోని రామ్ మనోహర్ లోహియా (ఆర్‌ఎంఎల్) ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే బాలుడు చేనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాలుడి తల్లి నీలు వాంగ్మూలం ఆధారంగా హత్య కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు బాలుడిని హత్య చేసింది పూజగా గుర్తించారు. గురువారం రోజు బాలుడి తల్లి లేని సమయంలో పూజ ఇంటికి వచ్చిందని పోలీసులు తెలిపారు. బాలుడి గొంతు కోసి చంపినట్లు నిర్దారించారు. నిందితురాలు పూజ బాలుడి కుటుంబానికి ముందే తెలుసని చెప్పారు. గతంలో ఆమెతో బాలుడి తల్లికి గొడవలు కూడా జరిగాయని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు నిందితురాలైన పూజను పట్టుకునే పనిలో ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-08-12T17:44:47+05:30 IST