దారుణం.. 8 ఏళ్ల బాలికపై ఈ దుర్మార్గుడు ఎంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో చూడండి..

ABN , First Publish Date - 2023-08-19T12:51:56+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలికపై హోటల్‌లో పని చేసే 18 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఈ నెల 16న జరిగింది.

దారుణం.. 8 ఏళ్ల బాలికపై ఈ దుర్మార్గుడు ఎంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో చూడండి..

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలికపై హోటల్‌లో పని చేసే 18 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఈ నెల 16న జరిగింది. 8 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బాలిక ఎదురుగా ఉన్న ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. అలీఘర్ జిల్లాకు చెందిన నిందితుడు బాలిక కుటుంబానికి సుపరిచితుడు. దీంతో తరచుగా వారి ఇంటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో బాలిక కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడింది. తల్లిదండ్రులు పని కోసం బయటికి వెళ్లగా.. ఈ నెల 16న బాలిక, ఆమె 11 ఏళ్ల సోదరుడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన నిందితుడు బాలిక ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే విషయం బాలిక వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సెక్టార్ 24 పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించడంతో నిందితుడు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే పక్కా సమాచారంతో నిందితుడిని పోలీసులు ఓ పాఠశాల సమీపంలో పట్టుకున్నారు. అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరగా 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-08-19T12:51:56+05:30 IST