Crime: విషాదంతాన్ని మిగిల్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ... అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-08-15T21:03:24+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో(Uttar Pradesh's Moradabad) ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరకు విషాదాన్ని మిగిల్చింది. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో(Triangle Love Story) అన్యాయంగా ఒకరి ప్రాణం పోయింది.

Crime: విషాదంతాన్ని మిగిల్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ... అసలు ఏం జరిగిందంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో(Uttar Pradesh's Moradabad) ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరకు విషాదాన్ని మిగిల్చింది. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో(Triangle Love Story) అన్యాయంగా ఒకరి ప్రాణం పోయింది. ఓ అమ్మాయి కేంద్రంగా సాగిన ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మిగిలిన ఇద్దరు నిందితులను పోలీసులు జైలుకు పంపారు. అసలు ఏం జరిగిదంటే.. విక్కీ(Vicky) అనే యువకుడు రేఖ(Rekha) అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే విక్కీకి తెలియకుండా రేఖ ఆకాష్( Akash) అనే మరో యువకుడితో కూడా ప్రేమలో(relationship) ఉంది. అలా ఇద్దరితో సదరు యువతి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపింది. కానీ ఈ విషయం విక్కీకి తెలిసింది. అటు ఆకాష్‌కు కూడా ఈ విషయం తెలిసింది. అయితే విక్కీ వేరే కులానికి చెందిన వ్యక్తి కావడంతో అతనితో రేఖ సంబంధం పెట్టుకోవడాన్ని ఆకాష్ అంగీకరించలేకపోయాడు. దీంతో రేఖ, ఆకాష్ కలిసి విక్కీని చంపేందుకు ప్లాన్ వేశారు.


పథకం ప్రకారం రేఖ ఫోన్ చేసి విక్కీని అడవిలోకి రప్పించింది. అక్కడే ఉన్న ఆకాష్ వెనక నుంచి తుపాకీతో విక్కీని కాల్చాడు. దీంతో విక్కీ అక్కడిక్కడే చనిపోయాడు. విక్కీ మృతదేహాన్ని ఆకాష్, రేఖ పొలంలో పడేశారు. పొలంలో శవం కనిపించడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. విక్కీ ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. విక్కీ ఫోన్ కాల్స్ లిస్ట్‌లో చివరి కాల్ రేఖ నుంచి వచ్చినట్టుగా ఉంది. దీంతో రేఖను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైలులో విచారించడంతో నిజం బయటపెట్టింది. రేఖ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఆకాష్‌ను కూడా అరెస్ట్ చేశారు. రేఖ, ఆకాష్ ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు తరలించారు.

Updated Date - 2023-08-15T21:03:24+05:30 IST