Kaveri Express: అమ్మో.. పెద్ద ప్రమాదమే తప్పిందిగా.. అదేగాని జరిగితే ఊహించుకోడానికే..

ABN , First Publish Date - 2023-06-27T12:48:53+05:30 IST

రైలు పట్టాలపై కాంక్రీట్‌ దిమ్మెలుంచిన వ్యవహారంలో ఒకరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్ణాటక రాష్ట్రం మైసూరు నుంచి చెన్నైకి బయల్దేరిన కావే

Kaveri Express: అమ్మో.. పెద్ద ప్రమాదమే తప్పిందిగా.. అదేగాని జరిగితే ఊహించుకోడానికే..

- రైలు పట్టాలపై కాంక్రీట్‌ దిమ్మెలుంచిన వ్యక్తి అరెస్ట్‌

వేలూరు(చెన్నై): రైలు పట్టాలపై కాంక్రీట్‌ దిమ్మెలుంచిన వ్యవహారంలో ఒకరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్ణాటక రాష్ట్రం మైసూరు నుంచి చెన్నైకి బయల్దేరిన కావేరి ఎక్స్‌ప్రెస్‌(Kaveri Express) రైలు శనివారం తెల్లవారు జామున తిరుపత్తూర్‌ జిల్లా పచ్చకుప్పం సమీపంలో వస్తుండగా రైలుపట్టాలపై పడేసిన కాంక్రీట్‌ దిమ్మెలు ధ్వంసం చేస్తూ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ యువకుడు పెద్ద రాతిని పట్టాలపై ఉంచుతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్‌ (41) అనే వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కాగా అతను బుద్దిమాంధ్యం లేని వ్యక్తిగా గుర్తించారు. దీంతో జోలార్‌పేట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు

nani9.2.jpg

Updated Date - 2023-06-27T12:48:53+05:30 IST