Share News

SBI: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో కొలువులు.. ఖాళీలెన్నంటే..!

ABN , First Publish Date - 2023-11-20T14:20:01+05:30 IST

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ)... జూనియర్‌ అసోసియేట్‌(క్లరికల్‌ కేడర్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

SBI: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో కొలువులు.. ఖాళీలెన్నంటే..!

  • ఎస్‌బీఐలో 8,283 జూనియర్‌ అసోసియేట్‌ ఖాళీలు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ)... జూనియర్‌ అసోసియేట్‌(క్లరికల్‌ కేడర్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

హైదరాబాద్‌ సర్కిల్‌లో 525; అమరావతి సర్కిల్‌లో 50 ఖాళీలున్నాయి.

పోస్టు: జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌)

రాష్ట్రాల వారీగా ఖాళీలు

1. ఉత్తరప్రదేశ్‌: 1781 2. ఆంధ్రప్రదేశ్‌: 50

3. మధ్యప్రదేశ్‌: 288 4. రాజస్థాన్‌: 940

5. ఢిల్లీ: 437 6. ఉత్తరాఖండ్‌: 212

7. ఛత్తీ్‌సగఢ్‌: 212 8. తెలంగాణ: 525

9. అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులు: 20

10. హిమాచల్‌ప్రదేశ్‌: 180 11. హరియాణా: 267

12. జమ్మూ అండ్‌ కశ్మీర్‌: 88 13. ఒడిశా: 72

14. పంజాబ్‌: 180 15. సిక్కిం: 4

16. తమిళనాడు: 171 17. పుదుచ్చేరి: 4

18. పశ్చిమ బెంగాల్‌: 114 19. కేరళ: 47

20. లక్షద్వీప్‌: 3 21. మహారాష్ట్ర: 100

22. అసోం: 430 23. అరుణాచల్‌ప్రదేశ్‌: 69

24. మణిపూర్‌: 26 25. మేఘాలయ: 77

26. మిజోరం: 17 27. నాగాలాండ్‌: 40

28. త్రిపుర: 26 29. గుజరాత్‌: 820

30. కర్ణాటక: 450 31. లడఖ్‌: 50

32. బిహార్‌: 415 33. ఝార్ఖండ్‌: 165

విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 2023 ఏప్రిల్‌ 1 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ(జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

బేసిక్‌ పే: నెలకు రూ.19,900

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష: 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ టైప్‌ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు- 30 మార్కులకు; న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు- 35 మార్కులకు; రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు- 35 మార్కులకు ఇస్తారు. పరీక్ష సమయం ఒక గంట. నెగెటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్‌ ఎగ్జామ్‌కు ఎంపికవుతారు.

మెయిన్‌ ఎగ్జామ్‌: ఈ పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 190 ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు - 50 మార్కులకు; జనరల్‌ ఇంగ్లీష్‌ 40 ప్రశ్నలు- 40 మార్కులకు; క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు- 50 మార్కులకు; రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు- 60 మార్కులకు ఇస్తారు. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపూర్‌, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, వరంగల్‌.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 7

ప్రిలిమినరీ పరీక్ష: 2024 జనవరి

మెయిన్‌ ఎగ్జామ్‌: 2024 ఫిబ్రవరి

వెబ్‌సైట్‌: https://sbi.co.in/web/careers/currentopenings

Updated Date - 2023-11-20T14:20:03+05:30 IST