Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ, రంగంలోకి ఆర్మీ..

ABN , First Publish Date - 2023-05-22T17:14:04+05:30 IST

మణిపూర్‌ లో ఇటీవల తలెత్తిన భారీ హింసాకాండ ఇప్పడిప్పుడే తగ్గుపడుతున్న సమయంలో సోమవారంనాడు మళ్లీ తాజా ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. ఇంఫాల్‌లోని న్యూ చెకాన్ ఏరియాలో మైతీ, కుకీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. రెచ్చిపోయిన అల్లరిమూక లాంబులేన్ ప్రాంతంలో ఇళ్లకు నిప్పుపెట్టింది. దీంతో ఆర్మీ రంగంలోకి దిగింది.

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ, రంగంలోకి ఆర్మీ..

ఇంఫాల్: మణిపూర్‌ (Manipur)లో ఇటీవల తలెత్తిన భారీ హింసాకాండ (Violence) ఇప్పడిప్పుడే తగ్గుపడుతున్న సమయంలో సోమవారంనాడు మళ్లీ తాజా ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. ఇంఫాల్‌లోని న్యూ చెకాన్ ఏరియాలో మైతీ, కుకీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. స్థానిక మార్గెట్‌లో స్థలం విషయంలో ఈ ఘర్షణ చోటుచేసుంది. దీంతో రెచ్చిపోయిన అల్లరిమూక లాంబులేన్ ప్రాంతంలో ఇళ్లకు నిప్పుపెట్టింది. ఇటీవల హింసాకాండ భయంతో జనం వదిలివెళ్లిన ఇళ్లకు అల్లరిమూక నిప్పుపెట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఆర్మీ, పాలామిటలరీ బలగాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నాయి. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో తక్షణం కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు.

మణిపూర్‌లో జాతుల మధ్య తలెత్తిన ఘర్షణ ఇటీవల పెద్దఎత్తున హింసాకాండకు దారితీసింది. షెడ్యూల్డ్ కులాల్లోకి తమను చేర్చాలనే మైతీల డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న గిరిజనులు చేపట్టిన సంఘాభావ యాత్ర హింసాకాండకు దారితీసింది. వారం రోజుల పాటు కొనసాగిన ఈ అల్లర్లలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ప్రజా ఆస్తులు బుగ్గిపాలయ్యారు. వేలాది మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని శరణార్థ శిబిరాలకు తరలివెళ్లారు. హింసను అదుపు చేసేందుకు ఆర్మీ, పాలామిలటరీ దళాలను కొద్దిరోజులుగా రాష్ట్రంలో మోహరించారు. ఘర్షణలకు దిగిన ఇరువర్గాల ప్రతినిధులను కలుస్తానని, హింసతో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో తాజాగా మరోసారి ఇరువర్గాలు బాహాబాహీకి దిగడం, ఇళ్లు తగులబెట్టిన ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కిపడింది.

Updated Date - 2023-05-22T17:14:04+05:30 IST