Karnataka: సంక్రాంతి సంబరాల్లో అపశృతి.. ఎడ్ల పందెంలో సడన్‌గా...

ABN , First Publish Date - 2023-01-16T16:34:07+05:30 IST

కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో అపశృతి దొర్లింది.

Karnataka: సంక్రాంతి సంబరాల్లో అపశృతి.. ఎడ్ల పందెంలో సడన్‌గా...

మాండ్య: కర్ణాటక(Karnataka) రాష్ట్రం మాండ్య(Mandya) జిల్లాలో జరిగిన సంక్రాంతి(Sankranti) వేడుకల్లో అపశృతి దొర్లింది. సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పందెంలో ఓ ఎద్దు అకస్మాత్తుగా అక్కడే ఉన్న ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతడు గాయపడ్డాడు. హోసహళ్లి గ్రామంలో ఈ పందేన్ని నిర్వహించారు. చిన్న చిన్న గడ్డిమోపులకు నిప్పుపెట్టి వాటిపై నుంచి ఎడ్లను దూకిస్తూ పందేన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రమాదం సంభవించింది. పందేన్ని చూసేందుకు వచ్చిన వ్యక్తిని ఓ ఎద్దు అకస్మాత్తుగా కుమ్మి కిందపడేసింది(Knock down). గాయాలపాలైన బాధితుడిని విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.

2.jpg

Updated Date - 2023-01-16T16:36:48+05:30 IST