Home » Karnataka
సీఎం పదవి కోసం డీకే శివకుమార్(DK Shivakumar) ఆత్రుత పడరాదని బీజేపీ నేత, తుమకూరు లోక్సభ అభ్యర్థి సోమణ్ణ(Somanna) సూచించారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికతో వివాహం పోలీసుల జోక్యంతో వాయిదా పడటంతో ఓ వ్యక్తి కిరాతకానికి ఒడిగట్టాడు. బాలిక ఇంటి కెళ్లి ఆమె తలనరికి దాన్ని తీసుకుని పారిపోయాడు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు (AP Elections) మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈసారి ఓటు వేయాల్సిందేనని తెలుగోడు గట్టిగా ఫిక్సయ్యాడు!. అందుకే దేశ విదేశాల్లో ఉన్న పలువురు ఓటర్లు ఇండియాకు విచ్చేయగా.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా వచ్చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు (Telugu People) ఓటింగ్పై ఆసక్తిగా ఉన్నారు...
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) మరో మూడు రోజుల్లో జరుగనున్నాయి. రేపటితో ప్రచారానికి కూడా తెరపడనుంది. ఈనెల 13న రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఓటింగ్పై ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏపీకి ప్రయాణాలు మొదలయ్యాయి కూడా.
కర్ణాటకలో కలకలం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajval Revanna) సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. జాతీయ మహిళా కమిషన్(NWC) గురువారం మాట్లాడుతూ.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై అసత్య ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ తెలిపింది.
ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ల వెనుక ఉన్నది కుమారస్వామేనని, వ్యక్తుల రాజకీయ జీవితాన్ని అంతం చేయడం, బ్లాక్మెయిలింగ్ చేయడంలో ఆయన కింగ్ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.
కర్ణాటక బీజేపీ విభాగం సోషల్మీడియోలో 'అభ్యంతకర పోస్ట్' పెట్టడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయకు బెంగళూరు పోలీసులు బుధవారంనాడు సమన్లు పంపారు. వారం రోజుల్లోగా తమ ముందు హాజరుకావాలని అందులో కోరారు.
లైంగిక వేధింపుల బాధితురాలి అపహరణ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను ఈనెల 14వ తేదీ వరకూ జ్యూడిషయల్ కస్టడీలోకి తీసుకోవాలని స్థానిక కోర్టు బుధవారంనాడు ఆదేశించింది. మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలను హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ ఎదుర్కొంటుండగా, బాధిత మహిళను అపహరించిన కేసును హెచ్డీ రేవణ్ణ ఎదుర్కొంటున్నారు.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. 196 దేశాలతో పాటు, ఇంటర్పోల్కు సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిపింది. ప్రజ్వల్ ఏ దేశంలోనైనా, విమానాశ్రయాలు, ఓడరేవుల్లో కనిపించినా సమాచారం ఇవ్వాలని ఇంటర్పోల్ను కోరామని పేర్కొంది.
‘బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనది’.. ‘మార్పు కోరుకోవడం మాత్రమే సరిపోదు.. మీరు వెళ్లి ఓటు వేయడం ద్వారా మార్పు చేసుకోవాలి’.. ‘బలమైన దేశాన్ని సృష్టించేందుకు మీ ఓటు హక్కును వినియోగించుకోండి’ అనే నినాదలు మనకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే, చాలా మంది ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు.