Drinking water: రేపటినుంచి తాగునీటి సరఫరాకు అంతరాయం
ABN , First Publish Date - 2023-11-16T07:43:02+05:30 IST
నగరంలోని నాలుగు మండలాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో తాగునీటి సరఫరా ఉండదని మెట్రోవాటర్ బోర్డు(Metro Water Board) తెలిపింది.
ఐసిఎఫ్(చెన్నై): నగరంలోని నాలుగు మండలాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో తాగునీటి సరఫరా ఉండదని మెట్రోవాటర్ బోర్డు(Metro Water Board) తెలిపింది. కోయం బేడులో మెట్రోరైలు సంస్థ ఆధ్వర్యంలో తాగునీటి పైప్ లైన్ కనెక్షన్లు జరగనున్నాయి. దీంతో చూలైమేడు, వళ్లువ ర్కోట్టం ప్రాంతాల్లో ఉన్న పంపింగ్ స్టేషన్ల నుంచి తాగు నీటి సరఫరా నిలిపివేయనున్నారు. అన్నానగర్, తేనాం పేట, కోడంబాక్కం, వలసరవాక్కం మండల పరిధికి చెందిన ప్రజలకు రెండు రోజులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. అత్యవసర సేవలకు మెట్రోవాటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయా లను సంప్రదించ వచ్చు.