Bihar: జేడీ(యూ) సీనియర్ కైలాష్ మహతోను ఆగంతకులు కాల్చి చంపారు...

ABN , First Publish Date - 2023-04-28T09:46:37+05:30 IST

బీహార్ రాష్ట్రంలో సీనియర్ జేడీ(యూ) సీనియర్ నాయకుడు కైలాష్ మహతోను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు....

Bihar: జేడీ(యూ) సీనియర్ కైలాష్ మహతోను ఆగంతకులు కాల్చి చంపారు...
JD(U) leader Kailash Mahto shot dead

కతిహార్(బీహార్): బీహార్ రాష్ట్రంలో సీనియర్ జేడీ(యూ) సీనియర్ నాయకుడు కైలాష్ మహతోను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.(JD(U) leader Kailash Mahto)కతిహార్‌నగరంలోని(Katihar) బరారీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్థరాత్రి బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు జేడీ(యూ) సీనియర్ నాయకుడు కైలాష్ మహతోపై పలు సార్లు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో 70 ఏళ్ల నాయకుడు కైలాష్ పొట్ట, తలపై బుల్లెట్ గాయాలవడంతో మరణించారు.

ఇది కూడా చదవండి :US Army helicopters: కూలిపోయిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు

భూ వివాదం వల్ల కాల్చిచంపారని(Shot Dead) పోలీసులు భావిస్తున్నారు. మృతుడు కైలాష్ కొన్ని రోజుల క్రితం తనకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కైలాష్ ను కాల్చిచంపిన ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని కటిహార్ పోలీసు అధికారి ఓం ప్రకాష్ చెప్పారు.

Updated Date - 2023-04-28T09:46:37+05:30 IST