Joshimath crisis: జాతీయవిపత్తుగా ప్రకటించేందుకు సుప్రీంకోర్టు నో..

ABN , First Publish Date - 2023-01-16T19:52:36+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగడాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు సుప్రీంకోర్టు...

Joshimath crisis: జాతీయవిపత్తుగా ప్రకటించేందుకు సుప్రీంకోర్టు నో..

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని జోషిమఠ్‌ (Joshimath)లో భూమి కుంగడాన్ని జాతీయ విపత్తు (National Disaster)గా ప్రకటించేందుకు సుప్రీంకోర్టు (Supreme court) నిరాకరించింది. పిటిషనర్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించింది. జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలంటూ అవిముక్తేశ్వరానంద సరస్వతి అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (PIL) వేశారు. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ''సుప్రీంకోర్టు విస్తృత అంశాలపై దృష్టిపెడుతుంది. ఈ పిటిషన్‌తో ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్తేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ కల్పిస్తున్నాం. అక్కడ పిటిషన్ వేసుకోవచ్చు'' అని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

Updated Date - 2023-01-16T19:52:37+05:30 IST