MP Kanimozhi: ఆ బిల్లును రహస్యంగా ప్రవేశపెట్టడమెందుకో?

ABN , First Publish Date - 2023-09-21T07:39:18+05:30 IST

మహిళా రిజర్వేషన్‌ బిల్లును రహస్యంగా ప్రవేశపెట్టడమెందుకని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ప్రశ్నించారు. పార్లమెంటు

MP Kanimozhi: ఆ బిల్లును రహస్యంగా ప్రవేశపెట్టడమెందుకో?

- డీఎంకే ఎంపీ కనిమొళి

ప్యారీస్‌(చెన్నై): మహిళా రిజర్వేషన్‌ బిల్లును రహస్యంగా ప్రవేశపెట్టడమెందుకని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ప్రశ్నించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలో మూడో రోజైన బుధవారం ఉదయం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే బిల్లు ప్రవేశపెట్టడంపై జరిగిన చర్చలో కనిమొళి పాల్గొన్నారు. అప్పుడు ఆమె స్పీకర్‌నుద్దేశించి మాట్లాడుతూ... 1996వ సంవత్సరం డీఎంకే మద్దతుతో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పరిచయమైందని, ప్రస్తుతం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును రహస్యంగా ప్రవేశపెట్టడానికి కారణం ఏమై ఉంటుందని ప్రశ్నించారు. ఇక తాను పార్లమెంటు కంప్యూటర్‌లో చూసి ఈ విషయం తెలుసు కోగలిగానని కనిమొళి ప్రస్తావించారు.

Updated Date - 2023-09-21T07:39:18+05:30 IST