Share News

Nitish Kumar: 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు...నితీష్ సర్కార్ నిర్ణయం

ABN , First Publish Date - 2023-11-07T21:08:58+05:30 IST

బీహార్‌లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి నితీష్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును నవంబర్ 9న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

Nitish Kumar: 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు...నితీష్ సర్కార్ నిర్ణయం

పాట్నా: బీహార్‌ (Bihar)లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వం మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి నితీష్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును నవంబర్ 9న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.


ప్రస్తుతం బీహార్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండగా, తాజాగా 65 శాతానికి పెంచాలని నితీష్ సర్కార్ నిర్ణయించింది. ఈడబ్ల్యూసీ కోటా కింద 10 శాతం రిజర్వేషన్ కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో మొత్తం రిజర్వేషన్ 75 శాతానికి పెరిగింది. అయితే, సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి మించి నితీష్ సర్కార్ 65 శాతం రిజర్వేషన్లను ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది.

Updated Date - 2023-11-07T21:09:00+05:30 IST