Rohini Sindhuri: ఎట్టకేలకు రోహిణి సింధూరికి పోస్టింగ్.. ఐపీఎస్‏తో ఏర్పడ్డ విభేదాల అనంతరం చాలారోజుల తర్వాత..

ABN , First Publish Date - 2023-09-15T10:38:18+05:30 IST

కర్ణాటక గెజిటేయర్‌ చీఫ్‌ ఎడిటర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరి(Rohini Sindhuri)ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎస్‌

Rohini Sindhuri: ఎట్టకేలకు రోహిణి సింధూరికి పోస్టింగ్.. ఐపీఎస్‏తో ఏర్పడ్డ విభేదాల అనంతరం చాలారోజుల తర్వాత..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కర్ణాటక గెజిటేయర్‌ చీఫ్‌ ఎడిటర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరి(Rohini Sindhuri)ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎస్‌ రూపామౌద్గిల్‌తో వివాదం తలెత్తిన తర్వాత రోహిణి సింధూరికి పోస్టింగ్‌ ఇవ్వలేదు. కొన్ని నెలల కాలంగా రిజర్వులో ఉన్న ఆమెకు పోస్టింగ్‌ ఇచ్చారు. గెజిటేయర్‌ చీఫ్‌ ఎడిటర్‌(Chief Editor of Gazetteer)గా నియమించారు. బీజేపీ పాలనలో ఐఏఎస్‌ రోహిణి సింధూరి, ఐపీఎస్‌ రూపామౌద్గిల్‌ల మధ్య విభేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. అప్పటి సీఎం బసవరాజ్‌బొమ్మై, చీఫ్‌ సెక్రటరీ ఇరువురినీ విధానసౌధకు రప్పించి మందలించిన విషయం తెలిసిందే.

pandu3.2.jpg

Updated Date - 2023-09-15T10:39:13+05:30 IST