Solar power: 20 ఎకరాల్లో సౌర విద్యుత్‌ కేంద్రం

ABN , First Publish Date - 2023-08-10T08:20:08+05:30 IST

నగరంలో 20 ఎకరాల్లో సౌరశక్తి విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌(Chennai Metrorail Limited) నిర్ణయించింది.

Solar power: 20 ఎకరాల్లో సౌర విద్యుత్‌ కేంద్రం

పెరంబూర్‌(చెన్నై): నగరంలో 20 ఎకరాల్లో సౌరశక్తి విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌(Chennai Metrorail Limited) నిర్ణయించింది. వింకోనగర్‌ నుంచి విమానాశ్రయం వరకు, చెన్నై సెంట్రల్‌ నుంచి సెయింట్‌ థామస్‌ మౌంట్‌ వరకు మెట్రోరైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గాల్లో మొత్తం 40 రైల్వేస్టేషన్లుండగా, 20 స్టేషన్లు సొరంగమార్గంలోను, మరో 20 పైన ఉన్నాయి. ఈ రైల్వేస్టేషన్లకు అవసరమైన విద్యుత్‌ ఎన్‌ఎల్‌సీ, విద్యుత్‌ బోర్డు నుంచి తీసుకుంటున్నారు. అదే సమయంలో, మెట్రో రైల్వేస్టేషన్లు, డిపోలు, నిర్వహణ కార్యాలయాలు, అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో సోలారు ప్యానళ్లు ఏర్పాటు చేసి, 5 నుంచి 6 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కోయంబేడు(Koyambedu), అశోక్‌ పిల్లర్‌ తదితర రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో 20 ఎకరాల స్థలాలు గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్యానళ్లు ఏర్పాటుచేసి సౌరశక్తి విద్యుదుత్పత్తి చేపట్టాలని సీఎంఆర్‌ఎల్‌ నిర్ణయించింది.

Updated Date - 2023-08-10T08:20:08+05:30 IST