Train Derails: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు...10మందికి గాయాలు

ABN , First Publish Date - 2023-01-02T07:58:54+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది...

Train Derails: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు...10మందికి గాయాలు
passenger train derails


జైపూర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది.(Train Derails) సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలోని పాలీలో పట్టాలు తప్పిన దుర్ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.(Ten injured) రాజ్ కియావాస్-బొమద్రా సెక్షనులో సోమవారం తెల్లవారుజామున 3.27 గంటలకు సూర్యనగరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. బాంద్రా టెర్మినల్ నుంచి జోద్ పూర్ వెళుతుండగా ఈ రైలు ప్రమాదానికి గురైంది. జైపూర్ హెడ్ క్వార్టరులో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ఈ రైలు ప్రమాదంతో ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద శబ్ధం వచ్చి ఒక్క సారిగా రైలు ఆగిపోయిందని, తేరుకొని చూస్తే 8 స్లీపరు క్లాస్ బోగీలు పట్టాలు తప్పాయని ప్రయాణికులు చెప్పారు.

Updated Date - 2023-01-02T08:00:59+05:30 IST