Share News

Election Results: సీఎం, డిప్యూటీ సీఎం ఓటమి... ఓటరు దేవుడు వినూత్న తీర్పు

ABN , First Publish Date - 2023-12-04T17:40:42+05:30 IST

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అధికార మిజో నేషనల్ ఫ్రంట్‌ను వెనక్కి నెట్టేసింది. లాల్ దహోమా సారథ్యంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌వెంట్ 40 స్థానాల్లో 27 స్థానాలు గెలుచుకుని అధికారం ఖాయం చేసుకోగా, ఎంఎన్ఎఫ్ 10 సీట్లకే పరిమితమైంది.

Election Results: సీఎం, డిప్యూటీ సీఎం ఓటమి... ఓటరు దేవుడు వినూత్న తీర్పు

ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో (Mizoram Assembly elections) ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (Zoram People's Movement) ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF)ను వెనక్కి నెట్టేసింది. లాల్ దహోమా (Lalduhoma) సారథ్యంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌వెంట్ 40 స్థానాల్లో 27 స్థానాలు గెలుచుకుని అధికారం ఖాయం చేసుకోగా, ఎంఎన్ఎఫ్ 10 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 2, కాంగ్రెస్ 1 సీటు గెలుచుకున్నాయి. ముఖ్యమంత్రి జోరంథాంగ (Zoramthanga), ఉప ముఖ్యమంత్రి తావ్‌లుయియా చిత్తుగా ఓడిపోయారు. జేపీఎం సీఎం అభ్యర్థి లూల్ దహోమా తన సమీప ఎంఎన్ఎఫ్ అభ్యర్థిపై 2,982 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.


ఎవరీ లాల్ దహోమా?

జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీని నడిపిస్తున్న 74 ఏళ్ల లాల్ దహోమా గతంలో IPS అధికారిగా పని చేశారు. గోవాలో కెరీర్ ప్రారంభించిన దహోమా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భద్రతా ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదులుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున 1984లో లోక్‌సభలో అడుగుపెట్టారు. అనంతరం పార్టీని వీడి భారతదేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టంపై డిశ్చార్జ్ అయిన మొదటి ఎంపీగా నిలిచారు. అనంతరం 2017లో జోరం నేషనలిస్ట్ పార్టీ స్థాపించి ఆ తర్వాత జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌ కూటమిలో చేరారు. 2018లో ఆ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. 2023లో మరోసారి సీఎం అభ్యర్థిగా పార్టీని ముందుండి నడిపించి విజయకేతనం ఎగురవేశారు.


జేపీఎం గెలుపు స్థానాలివే...

జేపీఎం గెలిచిన 27 స్థానాల్లో కోలాసిబ్, ఛాల్‌ఫిల్హ్, తావి, ఐజ్వాల్ నార్త్-1, ఐజ్వాల్ నార్త్-2, ఐజ్వాల్ నార్త్-3, ఐజ్వాల్ ఈస్ట్-2, ఐజ్వాల్ ఈస్ట్-1, ఐజ్వాల్ వెస్ట్-2, ఐజ్వాల్ వెస్ట్-3, ఐజ్వాల్ సౌత్-1, ఐజ్వాల్ సౌత్-2, ఐజ్వాల్ సౌత్-3, లెంగ్టెంగ్, తియిచాంగ్, చాంపాయ్ నార్త్, చాంపాయ్ సౌత్, తయికుమ్, హ్రంగ్‌టుర్జో, సౌత్ తియిపి, లుంగ్లే నార్త్, లుంగ్లే ఈస్ట్, లుంగ్లే వెస్ట్, లుంగ్లే సౌత్, లుంగ్లే ఈస్ట్, సెర్చిప్ ఉన్నాయి.


అధికార మిజో నేషనల్ ఫ్రంట్ పది స్థానాల్లో గెలుపొందగా, పలక్, సైహా సీట్లతో బీజేపీ గెలుపొందింది. ఓటమి చవిచూపిన ఎంఎన్ఎఫ్ నేతల్లో ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తదితరులు ఉన్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, 8.30 గంటలకు ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించారు. కొద్ది మంది ఓటర్లే ఉనన కొన్ని సీట్లకు రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తికాగా, పలు నియోజకవర్గాల్లో ఐదు రౌండ్ల కౌటింగ్ జరిగింది. 4,000 మందికి పైగా ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. మిజోరంలో నవంబర్ 7న పోలింగ్ జరుగగా, 80 శాతం పోలింగ్ నమోదైంది. ఎంఎన్ఎఫ్, జేపీఎం, కాంగ్రెస్ మొత్తం 40 సీట్లలో పోటీ చేయగా, బీజేపీ 23 స్థానాల్లో పోటీ చేసింది. ఆప్ తొలిసారి నాలుగు సీట్లలో పోటీ చేసింది. 17 మంది ఇండిపెండెంట్లు కూడా పోటీ చేశారు.

Updated Date - 2023-12-04T17:56:41+05:30 IST