Indian Lady: అయ్యో.. ఎంత పని చేశావమ్మా.. కువైత్‌లో హృదయాన్ని కలిచివేసే ఘటన!

ABN , First Publish Date - 2023-02-21T08:28:59+05:30 IST

కువైత్‌లో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది.

Indian Lady: అయ్యో.. ఎంత పని చేశావమ్మా.. కువైత్‌లో హృదయాన్ని కలిచివేసే ఘటన!

కువైత్ సిటీ: కువైత్‌లో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ మహిళ (Indian Lady) తన ఇద్దరు పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆరు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు (Tamil Nadu) చెందిన కార్తీ, అఖిల భార్యాభర్తలు. వీరికి 12ఏళ్ల పాప, 10ఏళ్ల బాబు ఉన్నారు. దంపతులిద్దరూ కువైత్‌లో (Kuwait) ఇంజనీయర్లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం కువైత్‌లోని ఫహహీల్ (Fahaheel) ప్రాంతంలో ఉంటున్నారు. పిల్లలు కువైత్‌లోని ఇండియన్ స్కూల్‌లో (Indian School) చదువుతున్నారు. అయితే, అఖిల గత కొంతకాలంగా డిప్రేషన్‌తో బాధపడుతోంది. దాంతో ఆమెకు చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమెను ఇంట్లోనే ఉంచుతున్నారు.

ఈ క్రమంలో ఈ నెల 19న భర్త కార్తీ ఎప్పటిలానే డ్యూటీకి వెళ్లిపోయాడు. ఇంట్లోనే ఉన్న అఖిల పిల్లలు నిద్రపోతున్న సమయంలో వారిని ఊరిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత వారు నివాసం ఉంటున్న భవనం ఆరో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇరుగుపొరుగు వారు వెంటనే ఈ ఘటన గురించి పోలీసులతో పాటు కార్తీకి ఫోన్ చేసి చెప్పారు. దాంతో ఆయన తన కూతురిని కాంటాక్ట్ చేశాడు. కానీ, ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే పిల్లలు ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: దుబాయిలో 3నెలల కింద కనిపించకుండా పోయిన భారత యువకుడు.. చివరికి..

Updated Date - 2023-02-21T08:29:03+05:30 IST