Grandmother: ఆరేళ్ల పిల్లాడిని చంపిన నాయనమ్మ.. తల్లి ఫిర్యాదుతో బయటపడిన నిజం.. ఎందుకీ పని చేశావని పోలీసులు నిలదీస్తే..

ABN , First Publish Date - 2023-08-01T17:06:32+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక బామ్మ తన స్వంత మనవడిని గొంతు నులిమి చంపేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బామ్మను అదుపులోకి తీసుకున్నారు. మనవడిని ఎందుకు చంపిందో ఆమె చెప్పింది విని పోలీసులు కూడా షాకయ్యారు.

Grandmother: ఆరేళ్ల పిల్లాడిని చంపిన నాయనమ్మ.. తల్లి ఫిర్యాదుతో బయటపడిన నిజం.. ఎందుకీ పని చేశావని పోలీసులు నిలదీస్తే..

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బిజ్నోర్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక బామ్మ తన స్వంత మనవడిని గొంతు నులిమి చంపేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బామ్మను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ బామ్మ తన నేరాన్ని అంగీకరించింది (Grandmother killed grand son). అయితే మనవడిని ఎందుకు చంపిందో ఆమె చెప్పింది విని పోలీసులు కూడా షాకయ్యారు. ఆ బామ్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది (Crime news).

కొత్వాలిలోని మొహల్లా పామర్ గంజ్‌లోని ఓ ఇంటిలో 6 ఏళ్ల బాలుడు సమద్ జులై 25వ తేదీన నాయనమ్మ చేతిలో హతమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గొంతు నులిమడం వల్లే బాలుడు చనిపోయాడని పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు వృద్ధురాలిని అరెస్ట్ చేశారు. విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు సమద్ తల్లిదండ్రులు ఆరిఫ్, షామా కొంతకాలంగా గొడవ పడుతున్నారు.

Girlfriend: నమ్మవా.. అంటూ విషం బాటిల్‌ను ఫొటో తీసి వాట్సప్‌ చేసిన ప్రేయసి.. ఓకే అని రిప్లై ఇచ్చిన ప్రియుడు.. చివరకు..!

విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. షామా తన పుట్టింటికి వెళ్లిపోగా ఆరిఫ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి దగ్గర ఉంటున్నాడు. మనవళ్ల ఇద్దరి సంరక్షణ చూడడం ఆ బామ్మకు కష్టంగా మారింది. పైగా సమద్ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ కుర్రాడికి సపర్యలు చేయలేక ఆ వృద్ధురాలు తీవ్ర నిర్ణయం తీసుకుంది. బాలుడి గొంతు నులిమి చంపేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వృద్ధురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2023-08-01T17:06:32+05:30 IST