Wife: అత్తమామలను పిలిచి అన్నం వడ్డించిన కోడలు.. కాసేపటికే ఇంట్లో ముగ్గురు మృతి.. అసలు ఆమె ఏం వండిందంటే..!

ABN , First Publish Date - 2023-08-16T15:57:32+05:30 IST

ఆ మహిళ ఆదివారం కదా అని తన అత్తమామల కుటుంబాన్ని భోజనానికి ఆహ్వానించింది. వారి కోసం ప్రత్యేకంగా పుట్టగొడుగులతో వంటలు చేసింది. అతిథులందరూ ఎంతో తృప్తిగా భోజనం చేశారు. అయితే కాసేపటికే వారి ఆరోగ్యం విషమించింది. భోజనానికి వచ్చిన నలుగురిలో ముగ్గురు చనిపోయారు.

Wife: అత్తమామలను పిలిచి అన్నం వడ్డించిన కోడలు.. కాసేపటికే ఇంట్లో ముగ్గురు మృతి.. అసలు ఆమె ఏం వండిందంటే..!

ఆ మహిళ ఆదివారం కదా అని తన అత్తమామల కుటుంబాన్ని భోజనానికి (Dinner) ఆహ్వానించింది. వారి కోసం ప్రత్యేకంగా పుట్టగొడుగుల (Mushroom)తో వంటలు చేసింది. అతిథులందరూ ఎంతో తృప్తిగా భోజనం చేశారు. అయితే కాసేపటికే వారి ఆరోగ్యం విషమించింది. భోజనానికి వచ్చిన నలుగురిలో ముగ్గురు చనిపోయారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భోజనానికి పిలిచిన మహిళ మాత్రం ఆ కూర తినకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు (Crime News).

ఆస్ట్రేలియా (Australia)లోని విక్టోరియా రాష్ట్రానికి చెందిన ప్యాటర్సన్ అనే మహిళ తన అత్తమామలు డాన్, గెయిల్‌లను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. వారితో పాటు మరదలు, ఆమె భర్త కూడా వచ్చారు. అతిథుల కసోం ప్యాటర్సన్ పుట్టగొడుగులతో చేసిన బీఫ్ వెల్లింగ్టన్‌ని (Beef wellington) వడ్డించింది. ఆహారం తిన్న తర్వాత అందరి పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో ముగ్గురు మృతి చెందారు. ఒకరు చికిత్స పొందుతున్నారు.

Credit Card: క్రెడిట్ కార్డు ఉందా..? అయితే ఈ మిస్టేక్ మాత్రం పొరపాటున కూడా చేయకండి..!

గొడ్డు మాంసం తయారు చేసిన పుట్టగొడుగులు విషపూరితంగా (Poison) మారినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ప్యాటర్సన్‌ను పోలీసులు అనుమానిస్తున్నారు. ``ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు. నేను నా కుటుంబాన్ని చాలా ప్రేమిస్తున్నాను. ఒక కిరాణా దుకాణం నుంచి నేనే పుట్టగొడుగులను తీసుకువచ్చా. తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కావడం లేదు. వారిని హత్య చేయాలనే ఉద్దేశం నాకు ఎంత మాత్రమూ లేదు. నా వంటలు తిన్న ఆత్మీయులు మరణించినందుకు చింతిస్తున్నాన``ని ప్యాటర్సన్ తెలిపింది.

Updated Date - 2023-08-16T15:57:32+05:30 IST