Shocking: మీ ఇంట్లోంచి ఏదో పాడు వాసన వస్తోందంటూ పక్కింటి వాళ్ల నుంచి ఫోన్.. హడావిడిగా వచ్చి తలుపులు తీసి చూస్తే..!

ABN , First Publish Date - 2023-09-04T14:51:01+05:30 IST

ఆ ప్రాంతంలో ఎప్పుడూ రానివిధంగా వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారంతా భయపడిపోయారు. తలుపు తీసి చూస్తే..

Shocking: మీ ఇంట్లోంచి ఏదో పాడు వాసన వస్తోందంటూ పక్కింటి వాళ్ల నుంచి ఫోన్.. హడావిడిగా వచ్చి తలుపులు తీసి చూస్తే..!

'అబ్బబ్బా ఇప్పటివరకు ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే ఇబ్బంది ఉండేది, ఇప్పుడు ఇంట్లోకి కూడా ఒకటే దుర్వాసన. అసలేమైందో ఏమో ఆ కొంపకు, కనీసం ఆ ఇంటి చుట్టాలకైనా కబురు పెట్టండ్రా' అంటూ ఆ వీధిలో ప్రతి ఇంట్లో ఒకటే నసుగుడు. ఇలాంటి దారుణమైన వాసన ఎప్పుడూ చూడలేదు. ఆరోగ్యాలు పాడైపోతామో అనిపించింది కొందరికి. వెంటనే ఆ ఇంటి బంధువులకు ఫోన్ కలిపారు.ఇంటి పరిస్థితి చెప్పారు. బంధువులందరూ వచ్చారు, వారి వెనుక పోలీసులు కూడా అక్కడికి చేరారు. ఆ ఇంటి తలుపులు తీసి చూడగా షాకింగ్ దృశ్యం కనబడింది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రం, అమరావతి నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. 45ఏళ్ల నీలిమ అనే మహిళ తన ఇద్దరు కొడుకులతో కలసి నాగ్‌పూర్ నుండి వచ్చి నివాసం ఉంటోంది. వారు ఉంటున్న ఇంట్లో నుండి ఒకటే దుర్వాసన వస్తుండటంతో ఇరుగు పొరుగు వారికి ఇబ్బందిగా మారింది. ఇంటికి వెళ్లి తలుపు కొడితే లోపల తలుపు గడియ వేసి ఉంది. ఇంటి వెనుక భాగంలో ఉన్న మరొక తలుపు దగ్గరకు వెళ్ళగా అది కూడా మూసి ఉంది. దీంతో అసలు లోపల దుర్వాసన ఎందుకు వస్తోందో ఇరుగుపొరుగు వారికి అర్థం కాలేదు. వారు నీలిమ పెద్ద కొడుకుకు ఫోన్ చేయగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నీలిమ, ఆమె చిన్న కొడుకుకు ఫోన్ చేయగా అవి కూడా కలవలేదు. దీంతో నీలిమ చుట్టాలకు ఫోన్ చేసి విషయం చెప్పారు. నీలిమ బంధువులు ఆ ఇంటి దగ్గరకు చేరుకుని తలుపులు బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. దుర్వాసనను బట్టి పోలీసులకు సమాచారం అందించడం మంచిదని పోలీసులకు ఫోన్ చేసారు. ఇంటి దగ్గరకు చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. లోపల కనిపించిన సీన్ చూసి అందరూ షాక్ కు గురయ్యారు.

Wife: భర్త చేసిన పనితో.. ఆ మహిళ కంట ఎంతకూ ఆగని కన్నీళ్లు.. నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో..!



ఇంట్లో పడకగదిలో బెడ్ మీద రక్తం కారిన గుర్తులు, ఆ గది మొత్తం మరింత దుర్వాసన రావడంతో గది మొత్తం పరిశీలించారు. గదిలో ఒక బాక్స్ కనిపించింది. అందులో నీలిమ(45), ఆమె చిన్న కొడుకు ఆయుష్(22) ఇద్దరు విగతజీవులుగా కనిపించారు(mother and son died). ఇంట్లోనుండి దుర్వాసన వస్తున్నప్పటి నుండి నీలిమ పెద్ద కొడుకు అసలు కనిపించలేదని, అతని మొబైల్ కూడా స్విచ్ ఆప్ లో ఉందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి హత్యకేసు నమోదు చేశారు. ఈ కేసు గురించి విచారణ జరుగుతోంది.

Shocking: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..? అప్పుడే పుట్టిన బిడ్డను ఆరో అంతస్తు పైనుంచి కింద పడేసిందో తల్లి..!


Updated Date - 2023-09-04T14:51:01+05:30 IST